ఘనంగా విజయశాంతి పుట్టిన రోజు వేడుకలు.

బిజెపి జాతీయ నాయకురాలు,మాజీ ఎంపీ విజయశాంతి పుట్టిన రోజు సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ ఆధ్వర్యంలో ఉప్పరి గూడలోని వాత్సల్య సింధు (నిరాశ్రీత బాలుర వసతి గృహము)లో పిల్లలతో కలిసి విజయశాంతి భోజనం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో ఆమె పాల్గొని అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ వారితో కలిసి భోజనం చేశారు.
ఈకార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి,వినాయక్ నగర్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి,దివాకర్,వసంశెట్టి శ్రీనివాస్, ఉమ మహేశ్వరి,మరియు మల్కాజిగిరి నియోజకవర్గ బిజెపి నాయకులందరూ పాల్గొన్నారు.