ఘోర బస్సు ప్రమాదం: 52 మంది మృతి

ఇర్గిజ్‌: కజికిస్థాన్‌‌లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఇర్గిజ్‌ జిల్లాలో ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో 52 మంది మృత్యువాతపడ్డారు. ఐదుగురు ప్రయాణికులు బస్సు నుంచి బయటికి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సులోని మృతులంతా ఉజ్బెకిస్థాన్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరింతా రష్యా నుంచి వస్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.