చండ్రుగొండలో యోగా దినోత్సవ వేడుకలు

చండ్రుగొండ జనంసాక్షి జూన్  21:అంతర్జాతీయ   యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు   300మంది విద్యార్థినీ విద్యార్థులతో కలిసి అబ్బురపరిచే    యోగాసనాలను ప్రదర్శించారు.  ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉండేటీ.ఆనంద్ కుమార్ మాట్లాడుతూ  యోగా ధ్యానం చేయడం ద్వారా విద్యార్థుల్లో  ఏకాగ్రత తో పాటు శారీరక పటిష్టతను పెంచుతుందన్నారు. పిల్లలకు   చిన్ననాటి నుంచే  యోగా పట్ల శ్రద్ధ పెంచేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు  మంజుశ్రీ కృష్ణా  ఎండీ హాషమ్ ఆదిలక్ష్మి రాజశ్రీ  వెంకటేశ్వరరావు రాములు లక్ష్మణ్  శకుంతల  రాజేష్ తదితరులు పాల్గొన్నారు.