చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు

– ప్రజలు బుద్దిచెప్పేందుకు సిద్ధమయ్యారు
– వైసీపీ నేత నందిగం సురేష్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత ఉందని, బాబుకు, ఆయన వర్గానికి బుద్దిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. దుర్మార్గపు పాలన సాగించే బాబుకు వైసీపీ అధినేత జగన్‌ను విమర్శించే అర్హత లేదని అన్నారు. మేం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఓ కార్యక్రమం చేపట్టామని, దానికి కౌంటర్‌గా ‘నిన్ను నమ్మాం బాబు’ అని పోస్టర్‌ పెట్టుకుంటున్నారన్నారు. విూ ఎమ్మెల్యేలు ఎంపీలు మిమ్మల్ని నమ్మం అని లోటస్‌ పాండ్‌ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నారన్నారు. చంద్రబాబు భాష మార్చుకోవాలని,  జగన్‌ గురించి మాట్లాడేసమయంలో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవుపలికారు. నిన్ను నమ్మం బాబూ అని విూ ఎమ్మెల్యేలే చెబుతున్నారని, రాష్ట్రాన్ని దోచుకుతిన్నారన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని, ఆయనకు వయసైపోయిందన్నారు. కుట్ర, కుళ్లు రాజకీయాలు, మనషులు చనిపోయిన దగ్గరకు కూడా వెళ్లి రాజకీయాలు చేసే నైజం చంద్రబాబుదన్నారు. 2014లో 600 చిల్లర హావిూలు ఇచ్చారని, అధికారం కోసం ఏది పడితే అది మాట్లాడారన్నారు. ఇప్పుడు తిరిగి అధికారం కోసం మా పథకాలు అన్నీ కాపీ కొట్టారన్నారు. ఈ విషయం ప్రజలకు తెలిసిపోయిందని, విూపార్టీ నుంచి అందరు వెళ్లిపోవడం చూసి ఫ్రస్టేష్రన్‌లో ఉన్నారన్నారు.  అందుకే అయోమయానికి గురవుతున్నారని, విూపార్టీ నుంచి వలసలు మొదలయ్యాయని, రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను నమ్మం బాబూ దిగిపో అనే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు తన సామాజిక
వర్గానికి తప్ప మిగిలినవారందరికి అన్యాయం చేస్తున్నారని ఆయన వద్ద ఉన్న నేతలే చెబుతున్నారన్నారు. చంద్రబాబు నేను మారాను.. నాకు ఓట్లేయండి అని గతంలో అడిగారని,  ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదన్నారు. చంద్రబాబుకు విూడియా మేనేజ్‌మెంట్‌ తప్ప మరోటి తెలియదని
విమర్శించారు.