చంద్రబాబు బీసీలను తక్కేస్తున్నాడు

– బీసీల్లోని అన్ని కులాలు ఐక్యం కావాలి
– త్వరలో గుంటూరులో యాదవ, బీసీ గర్జన సభ నిర్వహిస్తాం
– తానేం చెప్పినా నడుస్తుందనే భావనలో చంద్రబాబు ఉన్నాడు
– రెవెన్యూ లోటు అంటూ వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు
– ఎన్నికల కోసమే బాబు తాయిళాలు
– తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
విజయవాడ, ఫిబ్రవరి14(జ‌నంసాక్షి) : చంద్రబాబు బీసీలను అన్నివిధాలుగా తొక్కేశారని, అందుకే యాదవులు, బీసీలు ఐక్యం కావాలని తెలంగాణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. ఏపీలో పర్యటనలు చేస్తానని బీసీలను కదిలిస్తామని, చంద్రబాబు అణచివేత దోరణినికి బుద్దిచెబుతామని తెలిపారు. ఈ సందర్భవంగా గుంటూరులో యాదవ, బీసీ గర్జన ఏర్పాటు చేస్తున్నట్లు తలసాని తెలిపారు. గురువారం ఏపీకి వచ్చిన తలసాని.. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలన చూస్తుంటే.. మనం భారతదేశంలో ఉన్నామా?, వేరే దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు.  ఏపీలో ప్రభుత్వ పాలన ఆశాజనకంగా లేదని, ప్రచార ఆర్భాటమే తప్ప మరొకటి లేదన్నారు. మాట్లాడితే ముఖ్యమంత్రి రెవెన్యూ లోటు ఉందంటూ పదే పదే చెబుతూ మరోవైపు వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నామని నాలుగేళ్లు నుంచి చెబుతున్నారని, తాము ఏం చెప్పినా నడుస్తుందనే భావనలో ఇక్కడ ప్రభుత్వం ఉందని తలసాని విమర్శించారు. గతంలో తాను ఏపీకి వచ్చి వెళ్లాక మావాళ్లను వేధించారని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు కూడా చాలమంది మంత్రులు వస్తారని, వారిని పోలీసులు ఎందుకు వచ్చారని అడగరని అన్నారు. హాయ్‌ల్యాండ్‌లో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ అనుకుంటే ఇంటెలిజెన్స్‌ నుంచి ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు.  అంతేకాకుండా హాయ్‌ ల్యాండ్‌ లో బస చేస్తున్నానని హాయ్‌ ల్యాండ్‌ యాజమాన్యంను కూడా పోలీసులు బెదిరించారన్నారు. తాను ప్రెస్‌విూట్‌ పెట్టిన ¬టల్‌ యాజమాన్యంపై కూడా ఒత్తిడి చేశారని, ఏపీలో ప్రభుత్వ పాలన దారుణంగా ఉందని అన్నారు. ఏపీని సింగపూర్‌ చేస్తానని అంటూ, అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని తలసాని వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ని నేనే కట్టానని చెప్పే చంద్రబాబు కనీసం కనకదుర్గమ్మ ప్లైఓవర్‌ను ఎందుకు కట్టలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. గతంలో ప్రత్యేక ¬దా సంజీవని కాదన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రంపై ¬దా కోసం పోరాటం అంటున్నారని మండిపడ్డారు. పాడి పరిశ్రమ విూద నిర్లక్ష్యం చూపుతున్నారని, కేంద్రం పాడి పరిశ్రమ అభివృద్ధికి కౌంటర్‌ గ్యారెంటీ అడిగితే ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు …హెరిటేజ్‌ ఎలా లాభాల్లో ఉందో పాడి రైతులకు కూడా వివరించాలని తలసాని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో అభివృద్ధిలో రియాలిటీ ఉందని, సీఎం కేసీఆర్‌ 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారని, అదే ఏపీలో రైతులకు సరైన విధంగా కరెంట్‌ ఇవ్వడం లేదన్నారు. రైతులకు ఇస్తామని చెప్పిన పదివేల రూపాయల పై కూడా ఏపీ ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ను కూడా ఏపీ సర్కార్‌ పక్కదోవ పట్టించిందని, కేంద్రం కూడా దీనిపై గైడ్‌ లైన్స్‌ ఇవ్వలేదని తెలిపారు. కానీ చంద్రబాబు సర్కార్‌.. కాపులను మోసం చేసేందుకు దీనిలో 5శాతం రిజర్వేషన్‌ కేటాయించినట్లు ప్రకటించిందన్నారు.