చిన్నారి ప్రాణం తీసిన‌ స్కూల్ బస్సు

రంగారెడ్డి(జ‌నం సాక్షి): జిల్లాలోని షాబాద్ మండలం గోపిగడ్డలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. అద్య అనే చిన్నారి తన అన్న బడికి వెళుతుంటే తండ్రితో కలిసి బస్సు వద్దకు వచ్చింది. బస్సు కదిలే సమయంలో చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికలు సమాచార మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.