చిన్న ఓదాలలో గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు..

! జనం సాక్షి , మంథని: పెద్దపెల్లి జిల్లా మంథని మండలం చిన్న ఓదాల మానేరు ఇసుక క్వారీ నుండి జాతీయ హరిత ట్రిబునల్ మధ్యంతర ఉత్తర్వుల ను ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు,అక్రమ రవాణా చేపడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్, న్యాయవాది శశిభూషణ్ కాచే ఆరోపించారు. ఈ తతంగం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామ శివారు రావుల పల్లె నుండి జరుగుతున్నదని పేర్కొన్నారు. టిఎస్ఎండిసి అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.