చురుకుగా ఓటు నమోదు సాగాలి: ఎమ్మెల్యే

వరంగల్‌,జనవరి28(జ‌నంసాక్షి): ప్రతి ఒక్కరూ విధిగా తన ఓటును నమోదు చేసుకోవాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్యెల్యే వినయ్‌ భాస్కర్‌ కోరారు. చివరికి తమ ఓటు లేదని ఎవరు కూడా ఆరోపిణలు లేకుండా సరిచూసుకోవాలని అన్నారు.గ్రావిూణ ప్రాంతాల్లో కన్న పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదవుతుందని అన్నారు. విద్యావంతులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అన్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదు కావటం విచారకరమన్నారు. విద్యావంతులు, మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు అధికంగా ఉన్న నగరంలో ఓటింగ్‌ శాతం తగ్గటం సరికాదని, రానున్నఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.