చెప్పు, డప్పునకు పెన్షన ఇవ్వాల్సిందే
మంత్రులకు ఎమ్మార్పీఎస్ బృందం విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబరు 17: చెప్పులు కుట్టే, డప్పులు కొట్టే వృత్తిదారులకు పెన్షన ఇవ్వాలన్న న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ (టీఎస్) ప్రతినిధులు రాష్ట్ర మంత్రులను కోరారు. ఇందుకోసం జీవో 183ని పునరుద్ధరించాలని, మాదిగలు, ఉపకులాల డిమాండ్లని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ని ఎమ్మార్పీఎస్ (టీఎస్) ప్రతినిధులు కలిశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడాలని మంత్రులను కోరారు. ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ తదితరులు మంత్రులను కలిసిన బృందంలో ఉన్నారు.