చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయాలక ఆర్థిక తోడ్పాటు

జిల్లావ్యాప్తంగా మత్స్యశాఖ అధికారుల విస్తృత ప్రచారం
వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం అనేక  సంఘాలున్నాయి.  ఆయా సంఘాల సభ్యులకు చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయాలతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.26 కోట్లు మంజూరయ్యాయి. చేపలపై ఆధారపడి ఉన్న మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా ఎదిగేలా ఈ పథకం ద్వారా సహకారం అందించనున్నారు. చేపల ఉత్పత్తిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం, వేటకు అవసరమైన వ్యవస్తీకృత సౌకర్యాలు సమకూర్చ నున్నారు. ప్రాసెసింగ్‌కు, మార్కెటింగ్‌కు సహకారం అందజేయనున్నారు. స్థానిక యూనిట్ల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. శిక్షణ శిబిరాల ద్వారా మత్స్యకారుల్లో నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారు. విత్తన చేపల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించేలా ప్రోత్సహించనున్నారు. జవిూకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మంజూరు చేసే యూనిట్లను మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటిది వ్యక్తిగతం, రెండోది గ్రూపులకు, మూడోది సొసైటీలకు వర్తింపజేస్తారు. చేపల విత్తనాల హెచరీస్‌ నిర్మాణానికి యూనిట్‌ విలువ రూ.25 లక్షలు. ఇందులో రాయితీ రూ.18.75 లక్షలు కాగా లబ్ధిదారుని వాటా రూ.6.25 లక్షలు. విత్తన చేపల పెంపకం యూనిట్‌ విలువ రూ.7.50 లక్షలు. ఇందులో రాయితీ రూ.5.625 కాగా లబ్ధిదారుని వాటా రూ.1.875. కొత్త చేప విత్తన క్షేత్ర నిర్మాణం యూనిట్‌ విలువ రూ.2 కోట్లు, ఇందులో నూరుశాతం రాయితీ వర్తింపజేస్తారు. చెరువు సవిూపంలో ఏర్పాటు చేసే చేప విత్తన చెరువులు యూనిట్‌ విలువ రూ.7.50 లక్షలు. ఇందులో రాయితీ రూ.6.75 కాగా లబ్ధిదారుని వాటా రూ.0.75 లక్షలు. చేప విత్తన క్షేత్రాలను బలోపేతం చేయటానికి యూనిట్‌ విలువ రూ.5 కోట్లు. ఇందులోనూ నూరుశాతం రాయితీ వర్తింపజేస్తారు.  మహిళా మత్స్యకార సంఘాలకు మార్కెటింగ్‌ సహాయం రివాల్వింగ్‌ నిధి సమకూర్చడం కోసం యూనిట్‌ విలువ రూ. 2లక్షలుగా నిర్ణయించారు. ఇందులో నూరుశాతం రాయితీ కల్పించారు. చేపల రిటైల్‌ మార్కెట్‌ నిర్మాణం యూనిట్‌ విలువ రూ.10లక్షలు. ఇందులోనూ నూరుశాతం రాయితీ కల్పించారు. ¬ల్‌సేల్‌ చేపల మార్కెట్‌ నిర్మాణం యూనిట్‌ విలువ రూ.2 కోట్లు కాగా నూరుశాతం రాయితీ సౌకర్యం కల్పించారు. చేపల ల్యాండింగ్‌ కేంద్రం నిర్మాణం యూనిట్‌ విలువ రూ.10 లక్షలు కాగా నూరుశాతం రాయితీ కల్పించారు.