చేవెళ్ల పార్లమెంటు బిజెపి కైవసం

భాజాపాచేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి
తాండూరు జనవరి 13(జనం సాక్షి)
 చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం

తాండూరు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో చేవెల్ల పార్లమెంటరీ ఇంచార్జి జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పటేల్ రవి శంకర్, నాగారం నర్సింలు, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మనోహర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ సమీక్ష సమావేశం మరియు గ్రామపంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి ప్రణాళిక గురించి తాండూర్ నియోజకవర్గ బిజెపి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా భారతీయ జనతా పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి  మాట్లాడుతూ తాండూరులో బలపరిచిన సర్పంచులను గెలిపించుకోవాలని  సూచించారు  అదేవిధంగా వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం కావాలని దానికి సర్పంచ్ ఎలక్షన్లు సూచిక లాంటిదని  పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి మరియు మోడీ  పాలన గురించి ఓబీసీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన మోడీ గ ప్రభుత్వం గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్పారు . చేవెళ్ల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ తప్పక గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు  . అనంతరం పటేల్ రవి శంకర్ మాట్లాడుతూ  ఎమ్మెల్యే  ఎన్నికల్లో  తనకు సహకరించిన కార్యకర్తలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇక ముందు జరగబోయే ఎలక్షన్లలో కూడా అందరం కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీ సంబంధించిన సర్పంచులు మరియు చేవెళ్ల పార్లమెంట్ మెంబర్ ని గెలిపించు కుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శెట్టి రమేష్ , బాలేశ్వర గుప్తా , రాష్ట్ర  ఓ బి సి అధికార ప్రతినిధి గాజుల శాంతి కుమార్ , పట్టణ ఇంచార్జ్ కృష్ణ ముదిరాజ్ ,  నారా శ్రీకాంత్ , బాలి శివ కుమార్  , భారతి ఇంద్ర చారి ,హనుమంతు  మరియు అన్ని మండలాల అధ్యక్షులు మరియు కార్యదర్శులు తాండూరు తాండూరు పట్టణ కార్యకర్తలతోో పాటు తదితరులు పాల్గొన్నారు