చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్‌

హైదరాబాద్‌,మే24(చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్‌): రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బైక్‌ దొంగను అరెస్ట్‌ చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 16 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పహడీషరీఫ్‌లో పశువుల చోరీ కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 2.15 లక్షల నగదు, రూ. 4 లక్షల విలువచేసే పశువులు, 4 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.