చౌటుప్పల్ లో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

పాల్గొన్న మంత్రి. శాసన సభ్యులు
చౌటుప్పల్. జనం సాక్షి
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం చౌటుప్పల్ టౌన్ లో 11.30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరై జాతీయ గీతాలపన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్, హుజూర్ శాసన సభ్యులు శానంపూడి సైది రెడ్డి, కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మునుగోడు మాజీ శాసన సభ్యులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు, మండల స్థాయి నాయకులు, జిల్లా అధికారులు, ప్రభుత్వ , ప్రైవేట్ కళాశాలల విధ్యార్ధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.