చౌడేశ్వరి ఆలయంలో చోరీ

తిరుపతి,నవంబర్‌14(జ‌నంసాక్షి): గ్రామ శివారులో ఉన్న చౌడేశ్వరీ అమ్మవారి దేవాలయంలో ఆలయ హుండీ చోరీ జరిగిన ఘటన బుధవారం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా వి.కోట మండల కేంద్రం 55 రెవెన్యూ గోనుమాకులపల్లె పంచాయితీలో గ్రామ శివారులో ఉన్న చౌడేశ్వరీ అమ్మవారి దేవాలయంలో నిన్న రాత్రి దుండగులు ఆలయ హుండీని చోరీ చేశారు. కట్టుదిట్టంగా హుండీని అమర్చినా దుండగులు దాన్ని ఇనుప పరికరాలతో కోసి, హుండీలో ఉన్న నగదును కాజేసి గ్రామ పొలిమేరల్లో ఉన్న చెరువు పొదల్లో పారేసి వెళ్లిపోయారు. స్థానిక సమాచారం మేరకు ఆలయ హుండీలో రూ.20 వేలు నగదు ఉన్నట్టు సమాచారం. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.