ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

bhopal_647_103116121333వరంగల్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కాల్మెట్టా అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు, మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సల్ చనిపోయాడు.
మృతుడిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం కొంగల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు మృతదేహాన్ని గుర్తించి, తీసుకువచ్చేందుకు శుక్రవారం బీజాపూర్ బయలుదేరి వెళ్లారు.