జగన్‌ సామ్రాజ్యంలో కెటిఆర్‌ సామంతరాజా?

లండన్‌ వెళుతూ ఏమైనా ప్రకటించారా
కుటుంబ పాలన కోసం రాష్ట్రాన్ని విడదీశారు
కెటిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ దేవినేని
అమరావతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): జగన్‌ లండన్‌ వెళ్తూ వైకాపా ఇన్‌ఛార్జి పదవిని కేటీఆర్‌కు ఏమైనా అప్పగించారా? అని మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. కేసీఆర్‌ చక్రవర్తి ఆయన యువరాజు కేటీఆర్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సామంత రాజుగా జగన్‌ను ప్రకటించారని ఆయన ఎద్దేవా చేశారు. వైకాపా, తెరాస జోడీకి సంయుక్తంగా ప్రజలు గిప్ట్‌ ఇవ్వబోతున్నారని అన్నారు. మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతు న్నారు. విూ పెత్తనాలు, కుటుంబ పాలన కోసం రాష్ట్రాన్ని విడదీశారు. ఇప్పుడు మా రాష్ట్రంపై పెత్తనం చేయాలని బయల్దేరితే సహించేది లేదు అంటూ దేవినేని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఆదివారం విూడియాతో మాట్లాడిన దేవినేని.. మోదీ, కేసీఆర్‌, జగన్‌పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసే వారిపై దాడులు చేస్తున్నారని, నోటీసులు ఇచ్చి ఆస్తులు ఆక్రమించుకుంటామని బెదిరిస్తున్నారని దేవినేని ఆరోపించారు. మోదీ నాయకత్వంలో కేసీఆర్‌ దుర్మార్గాలు, కుట్రలు చేస్తున్నారని.. మోదీ, జగన్‌, కేసీఆర్‌ కలిసి చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు 26 పార్టీలను ఏకతాటిపైకి తెస్తే మా దేశభక్తిని శంకిస్తారా? అని ప్రశ్నించారు. అధికారం ఉందనే మిడిసిపాటు తగదని ఎద్దేవాచేశారు. విూరు మాట్లాడే ప్రతి మాటా మా ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉంది. ఐదు కోట్ల మంది ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని దేవినేని అన్నారు. జూన్‌లో చంద్రబాబు చెప్పే ప్రధానే దిల్లీలో వస్తున్నారని, చరిత్ర పునరావృతమవుతుందని పేర్కొన్నారు. పోలవరంపై కవిత కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.
అందుకే జగన్‌ పోలవరం వెళ్లట్లేదు
జగన్‌ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించలేదని మంత్రి దేవినేని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌
పునాదులు కూడా లేవలేదని జగన్‌ చెబుతున్నారని, కానీ, అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తే ఎక్కడ వాస్తవాలు చెప్పాల్సి వస్తుందోనని వెళ్లట్లేదని విమర్శించారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఏ ప్రాజెక్టు కూడా ఇంత వేగంగా జరగట్లేదని చెప్పారు. రాష్ట్ర బ్జడెట్‌ నుంచి రూ.4,121 కోట్లు ఖర్చు పెట్టి పనులను పరుగెత్తిస్తున్నారు అని చెప్పారు. రూ.1500 కోట్లు ఇచ్చి దిల్లీని తలదన్నే రీతిలో రాజధాని నిర్మించాలని మోదీ ఎగతాళి చేశారని విమర్శించారు. మోదీ తెలుగు జాతిపై ఎందుకు కక్ష గట్టారు? అని ప్రశ్నించారు.
జలీల్‌ కుమార్తె విజయం ఖాయం
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ కుమార్తె షబానా ఖాతూన్‌కు టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈమెకు టికెట్‌ ఇవ్వడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. జలీల్‌ ఖాన్‌ కుమార్తె విజయం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గోద్రా అల్లర్లపై ప్రశ్నించినందుకే చంద్రబాబుపై మోదీ కక్ష పెంచుకున్నారన్నారు. అవినీతిపరుడు వైఎస్‌ జగన్‌తో కలిసి చీకటి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ప్రధాని మోదీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని దేవినేని ఉమ చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే తనకు సీటు ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు. టీడీపీ విజయానికి అందరం కలిసి పనిచేస్తాం. నన్ను ఆశీర్వదించేందుకు వచ్చినవారికి ధన్యవాదాలు’ అని షబానా చెప్పుకొచ్చారు.