జగిత్యాలలో జంట హత్యల కలకలం..

కరీంనగర్ : జగిత్యాలలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరని హత్య చేసి మురుగునీటి కాలువలో పడేశారు. జగిత్యాలలో భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు బండరాయితో మోది హత్య చేసిన అనంతరం మురికినీటి కాలువలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.