జడ్పిటిసి పోశం నరసింహ రావుకి రాఖీ కట్టిన మహిళలు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 12 (జనం సాక్షి): మణుగూరు లోని మండల సమైక్య భవన్లో రాఖీ పౌర్ణమి సందర్బంగా శుక్రవారం మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావుకి కుల మతాలకు అతీతంగా గిరిజన, గిరిజనేతర ఆడబిడ్డలు రాఖీ లు కట్టి తమ సోదర భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ చిరునవ్వు కు చిరునామా, మంచి మనసు కు మారు పేరుగా ఏ సమస్య వచ్చిన నేనున్న అంటూ వెంటనే సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసి అన్ని విధాల సహాయ సహకారాన్ని అందిస్తున్న నరసింహ అన్నకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పవిత్రమైన సోదర భావాన్ని బలోపేతం చేసేదే రక్షా బంధన్ అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళ అనురాగానికి ప్రతీకగా జరుపుకొనే గొప్ప పండుగే రాఖీ పౌర్ణమి అన్నారు.తనకు రాఖీ కట్టిన ఆడ పడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య ఉద్యోగులు మహిళ సర్పంచులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.