జనహృదయనేత వాజ్‌పేయ్‌: ఎంపి జితేందర్‌ రెడ్డి

న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ప్రపంచాన్ని జయించిన గొప్ప మనసు వాజ్‌పేయిదని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. దేశానికి మూలపురుషుల్లో ఒకరైన వాజ్‌పేయిని కోల్పోవడంతో జాతి యావత్తూ రోదిస్తుందని అన్నారు. వాజ్‌పేయి భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ వాజ్‌పేయి గొప్ప నాయకుడుగా అందరి హృదయాలలో నిలిచిపోయిన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లిన వ్యక్తని, అలాంటి మనిషి ఇవాళ మన మధ్య లేనందుకు చాలా బాధపడుతున్నామని అన్నారు. గతంలో జితేందర్‌ బిజెపి ఎంపిగాపనిచేశారు. దీంతో ఆయనకు వాజ్‌పేయ్‌తో వ్యక్తిగత అనుబంధం ఉంది. వాజ్‌పేయి అజాత శత్రువని అన్నారు. రాజకీయంగా ప్రత్యర్థులు ఉన్నారనుకున్నారు కానీ, శత్రువులు ఉన్నారని ఆయన ఏనాడూ భావించలేదని కేకే అన్నారు. వాజ్‌పేయి గురించి చెప్పాలంటే హృదయం ద్రవించుకుపోతుందని అన్నారు. ఆయన మహానుభావుడని, అజాతశత్రువని కొనియాడారు. ఆయన లేకపోవడం దేశానికి పెద్ద లోటని అన్నారు.