జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి

జనగామ,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో సరిపోదని, జిల్లా కేంద్రాల్లో, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో కార్యాలయాల్లో సౌకర్యాలు సమకూర్చాలని సిపిఎం జిల్లా నాయకుడు జిల్లెల సిద్దారెడ్డి అన్నారు. ఏడాది పూర్తి చేసుకున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు. జనగామ జిల్లా ఏర్పాటుతో తమ పార్టీని కూడా విస్తరించి గ్రామస్థాయిలో బలోపేతం చేస్తున్నామని చెప్పారు. గ్రామగ్రామాన కమిటీలను ఏర్పాట చేసి ప్రజా సమస్యలపై పోరాఉబాట పడతామని అన్నారు. జనగామ జిల్లాలో ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీని తీర్చిదిద్దేందుకు తన వంతు కృషిచేస్తానని తెలిపారు. ప్రభుత్వం కేవలం సిద్దిపేటకు అధికనిధులు కేటాయించిన ఆయా జిల్లాలను విస్మరిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిగితా కొత్త జిల్లాలకు, రెవెన్యూ డివిజన్లకు, మండలాలకు నిధులు విడుదల చేసి ఆదుకోవాలని అన్నారు.