జిల్లా క్రీడాకారులకు ప్రోత్సాహం

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జిల్లాలో క్రీడల అభివృద్దికి ప్రత్యేక చొరవ తీసుకుని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సుధాకర్‌రావు అన్నారు. గతంతో పోలిస్తే వివిధ క్రీడాంశాల్లో పలువురు ఆస్తి కనబరుస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిని గుర్తించి తగు ప్రోత్సాహంతో పాటు, శిక్షణ ఇప్పిస్తున్నామని అన్నారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. హాకీలో జిల్లా జట్టు
రాష్ట్రస్థాయిలో సత్తా చాటి, అదే స్ఫూర్తితో జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు.  ఇప్పటినుంచే మెరుగైన సాధన చేయాలని సూచించారు. ఎంపికైన జట్లకు దసరా పండగ అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో పదిరోజుల పాటు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి హాకీ క్రీడాపోటీలు అక్టోబరు చివరి వారంలో ఆదిలాబాద్‌లోనే జరుగుతాయన్నారు. ఎంపికైన జట్టుకు జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహిస్తు న్నట్లు పేర్కొన్నారు. జిల్లాజట్టును రాష్ట్ర విజేతగా నిలపడానికి వ్యాయామ ఉపాధ్యాయులు  ప్రత్యేక శిక్షణ అందిస్తారన్నారు.