జీడిమెట్లలో మంటలు అంటుకున్నాయి..

3రంగారెడ్డి : నగర శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దూలపల్లికి చెందిన రుషికా కెమికల్స్ ఫ్యాక్టరీకి చెందిన గోదం పూర్తిగా మంటల్లో తగులబడిపోయింది. కెమికల్ ట్యాంకులు పేలడంతో ఈఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శకటాలతో చేరుకున్నారు. ఐదు గంటలు శ్రమించిన అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం కలిగినట్లు సమాచారం. ఎవరైనా మృతి చెందారా ? లేదా ? అనేది తెలియరాలేదు.
అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో సమీప కాలనీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారీగా మంటలు..పొగ అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనావాసాల మధ్య ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తుండడం..పలు ప్రమాదాలు చేసుకుండడంపై ప్రజలు భయపడుతున్నారు. వెంటనే ఇలాంటి ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.