జెడ్పి చైర్మన్ ను కలిసిన ఏఎంసీ చైర్మన్ దాసరి

 

 

 

 

 

రాజలింగు జనం సాక్షి, మంథని: పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన దాసరి రాజలింగు బుధవారం మంథనిలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ను కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జడ్పీ చైర్మన్ పుట్ట మధు సైతం ఏఎంసి చైర్మన్ గా నియమితులైన దాసరి రాజలింగుకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మంథని నియోజకవర్గ నాయకులు జక్కు రాకేష్, పూదరి సత్యనారాయణ, కమాన్పూర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, కమాన్పూర్ సహకార సంఘం మాజీ చైర్మన్ భద్రపు మల్లేష్, కమాన్పూర్ ఎంపీటీసీ కోలేటి శేఖర్, జూలపల్లి సర్పంచ్ బొల్లంపల్లి శంకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నీలం శ్రీనివాస్, నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మి మల్లు డైరెక్టర్లు పెండి నారాయణ, వొడ్నాల రాజు, ఇల్లందుల అశోక్, పప్పు చంద్రమౌళి, కారుకుట్ల ఓదేలు, బేడ సంపత్, బొల్లంపల్లి రమేష్, మైదం స్వప్న, కోలేటి సత్తయ్య, వంగాల లింగారెడ్డి పాల్గొన్నారు.