టిఆర్‌ఎస్‌లోనూ టిక్కెట్ల రగడ

 

ఖైరతాబాద్‌ కోసం మన్నె వర్గీయుల ఆందోళన

తెలంగాణ భవన్‌ ముట్టడించిన కార్యకర్తలు

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రసమితిలోనూ టిక్కెటల్‌ లొల్లి మొదలయ్యింది. కొన్‌ఇనచోటల్‌ సర్దుకు పోగా, టిక్కెట్లు ప్రకటించని ఖైరతాబాద్‌ తెరాస కార్యకర్తలు ఆందోళనకు గారు. దీంతో టికెట్ల కేటాయింపు వ్యవహారం అధికార తెరాసలోనూ సెగ పుట్టిస్తోంది. ఆశావహులు ఏకంగా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని తెరాస నియోజకవర్గ ఇన్‌ఛార్జి మన్నే గోవర్దన్‌ రెడ్డికి కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన మద్దతుదారులు, కార్యకర్తలు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ ఎదుట నినాదాలతో ¬రెత్తించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, ఖైరతాబాద్‌లో తెరాస అభివృద్ధికి పాటుపడిన గోవర్దన్‌ రెడ్డికే టికెట్‌ ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి దివంగత పీజేఆర్‌ కుమార్తె విజయా రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరిన దానం నాగేందర్‌ కూడా టికెట్‌ ఆశించే వారిలో ఉన్నారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం అభ్యర్థిపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో కార్యకర్తలు తెలంగాణ భవన్‌ ఎదుట ఈ రోజు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడికి చేరుకున్నపోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.