టిఆర్‌ఎస్‌ కార్యాలయాలకు ఎకరా చొప్పున భూమి

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ముందస్తు ఎన్నికలపై ముమ్మర ప్రచారం జరుగుతున్న వేళ.. 28 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు అధికార టీఆర్‌ఎస్‌ భూములు కేటాయించింది. గజం స్థలం రూ.100 చొప్పున ఎకరాకు మించకుండా భూములు కేటాయిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ జీవో జారీచేశారు.28 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు అధికార టీఆర్‌ఎస్‌ భూములు కేటాయించింది. సం బంధిత జిల్లా కలెక్టర్లకు పార్టీ జిల్లా అధ్యక్షులు గజానికి రూ.100 చొప్పున నిధులు చెల్లించి, స్థలాలను స్వాధీనం చేసుకోనున్నారు. సూర్యాపేట జిల్లాకు పిల్లలమర్రిలో ఎకరం, యాదాద్రి భువనగిరికి రాయగిరిలో ఎకరం భూమి కేటాయించారు.

———