టిఆర్ఎస్ పాటలకు ఇసి అనుమతి
హైదరాబాద్,నవంబర్19(జనంసాక్షి): టీఆర్ఎస్ పార్టీ ప్రచారం కోసం రూపొందించిన పాటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ అనుమతినిచ్చారు. మొత్తం ఆరు పాటలకు రజత్ కుమార్ అనుమతి ఇచ్చారు. ఇందులో సీఎం కేసీఆర్ స్వయంగా రెండు పాటలను రాసినట్లు గులాబీ నేతలు తెలిపారు. నామినేషన్ల పక్రియ ముగియడంతో సీఎం కేసీఆర్ మలివిడత ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు పాటల ద్వారా వినిపించేందుకు అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేసింది.