టిడిపికి కార్యకర్తలే బలం

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): అధికార తెరాస రాజకీయ కొనుగోళ్లకు తెరలేపిందని నగర టిడిపి అధ్యక్షుడు ఎంన్‌ శ్రీనివాసరావు అన్నారు. టిడిపి నుంచి ఎవరు వీడీపోయినా ప్రజల అండతో మళ్లీ ముందుకు సాగుతామని అన్నారు. కార్యకర్తలే టిడిపికి బలమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కొనసాగుతామని అన్నారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకు తెదేపా ప్రమాద బీమా పథకాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అధికార దాహంతో తెరాస తెదేపాను చీల్చాయని, అయినప్పటికీ ప్రజల్లో తెదేపాకు ఆదరణ ఉందన్నారు. మహాకూటమి నగరంలో ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు.