టిడిపిలో అవినీతిపరులకే పెద్దపీట

ప్రజాసేవ చేసేవారికి స్థానం లేదు: మేడా

కడప,జనవరి23(జ‌నంసాక్షి): ఈ నెల 31 వ తేదీన హైదరాబాదులో జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరనున్నారని మేడా మల్లికార్జున రెడ్డి ప్రకటించారు. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద రాజశేఖర్‌ రెడ్డికి మేడా మల్లికార్జున రెడ్డి బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ… ఈ నెల 31 వ తేదీన హైదరాబాదులో జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరనున్నారని ప్రకటించారు. టిడిపి లో దోపిడీదారులకే పెద్దపీట ఉందని, అభికృద్ధి, ప్రజాసేవ చేసే వారికి విలువ లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను తిట్టే వారికే పదవులని మండిపడ్డారు. జగన్‌ ఆదేశాల మేరకు తాము నడచుకుంటామని చెప్పారు. హైదరాబాదులో జగన్‌ ను కలిసి ఎలాంటి హావిూ తీసుకోలేదని తెలిపారు. రాజంపేట టికెట్‌ కూడా జగన్‌ అభీష్టమేనన్నారు. గతం నుండి వైఎస్సార్‌ కుటుంబంతో తమ కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో వైసిపి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమని, మరింత మంది టిడిపి ఎమ్మెల్యేలు త్వరలో వైసిపి లో చేరనున్నారని మేడా మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు.