టిప్పర్‌ బోల్తా: డ్రైవర్‌ మృతి

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): జూలూరుపాడు మండలం వినోభనగర్‌ గ్రామ సవిూపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ బోల్తా పడడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌ వెంకటేశ్వర్లు(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఏన్కూర్‌ మండలం గార్లఒడ్డు గ్రామం నుంచి కంకర లోడుతో  మణుగూరు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోస్టుమార్టం కోసం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.