టి నుండి తిరిగి ప్రారంభం కానున్న వై ఎస్ షర్మిల పాదయాత్ర.. 

 

 

 

 

 

 

 

టి నుండి తిరిగి ప్రారంభం కానున్న వై ఎస్ షర్మిల పాదయాత్ర… భువనగిరి టౌన్ (జనం సాక్షి):-@
వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వై ఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర తిరిగి ఈ నెల 2 వ తేది నుండి ప్రారంభం కానున్నదని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ మీడియా కు తెలిపారు. నవంబర్ నెలలో కొన్ని అనివార్య సంఘటనలు జరగడం వలన పోలీస్ అనుమతి ఇవ్వకపోవడం వలన పాదయాత్ర ఆగిపోవడం జరిగిందని తిరిగి పోలీస్ అనుమతి ఈ నెల 2 వ తేది నుండి ఇవ్వడం వలన వరంగల్ జిల్లా లోని నర్సంపేట నియోజకవర్గం లో ఆగిన చోట నుండే పాదయాత్ర తో మళ్ళీ వై ఎస్ షర్మిల ప్రజా క్షేత్రం లోకి అడుగు పెడుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి వై ఎస్ షర్మిల చేపట్టిన సుధీర్గ పాదయాత్ర కు వస్తున్న స్పందనను చూసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వలేక పాద యాత్ర వాహనాలను ధ్వంసం చేయడం జరిగిందని అయినా వై ఎస్ షర్మిల బయపడలేదని అక్కడ ఉంది పులి బిడ్డ అని అన్నారు. ఒక మహిళ అయి ఉండి ఇప్పటికే 3500  కిమీ నడవడం మొత్తం మహిళా లోకానికే గర్వకారణం అని అతహర్ అన్నారు.రాబోయే రోజులలో 4000 కిమీ ల పాదయాత్ర పూర్తి చేసి మహిళల తరుపున ఒక రికార్డు నెలకొల్పబోతున్నారని అన్నారు.