టీఆరెస్‌ దొరల అహంకార పార్టీ

– దళితుల ముఖ్యమంత్రిని విస్మరించి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు మోసం చేశారు.

-యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు తిరుపతి

వీర్నపల్లి నవంబర్‌ 12 (జనంసాక్షి):టీఆరెస్‌ దొరల అహంకార పార్టీ అని యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు తిరుపతి యాదవ్‌ ధ్వజమెత్తారు. ఆదివారం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 4 సంవత్సరాలు తెలంగాణ కుటుంబ పాలనలో బందీ అయిందని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని,విూ కపట ప్రేమ ప్రజలు నమ్మే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు.టీఆరెస్‌ పార్టీ సభ అంటే ప్రజలు రారని, రైతుల ఆశీర్వధ సభ గా మార్చారని అన్నారు.గత 14 రోజులు గా సిరిసిల్ల లో తిరుగుతున్న కెటిఆర్‌ గడిచిన 4 సంవత్సరాలు ఏమైపోయారని ప్రశ్నించారు.మళ్ళీ మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తూ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. జాతీయ స్థాయికి వెళ్ళిన నెరేళ్ల సంఘటన, దళితుల పైన దాడులు జరిగినప్పుడు పరామర్శించడానికి టైం లేని కెటిరామారావు గారికి ఇప్పుడు ఎలా టైం ఉందన్నారు. టీఆరెస్‌ పార్టీ దళితులను చాలా మోసం చేసిందని అన్నారు. దళిత వ్యతిరేక పార్టీ అని, దొరల అహంకార బుద్ది తో ఎస్సీ ఎస్టీ లకు తీరని అన్యాయం చేసారని వ్యాఖ్యానించారు.రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్‌ పార్టీ ని ఆశీర్వాధిస్తారని అన్నారు. ఓటమి భయం తో కేటీఆర్‌ పరేషాన్‌ అవుతున్నారని, అభివృద్ధి చేసివుంటే విూకు ప్రజలే ఓట్లు వేసి గెలిపిస్తారు కదా, ఓట్లు ఎందుకు అడుగుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల ప్రదానకార్యదర్శి రాములు నాయక్‌, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు రవి, మద్దిమల్ల గ్రామ శాఖ అధ్యక్షుడు రవి,మల్లయ్య, మైపాల్‌,రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.