టీఆరెస్ లోకి ఎర్ర జొన్నల ఉద్యమకారుడు                                

 నిజామాబాద్ బ్యూరో,అక్టోబర్19(జనంసాక్షి)         :
 ఎర్రజొన్నల ఉద్యమకారుడు గత పది సంవత్సరాల నుండి ఎర్ర జొన్నల రైతుల కోసం ఉద్యమిస్తున్న నవీన్ శుక్రవారం హైదరాబాద్ లో.     మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,మాజి స్పీకర్ సురేష్ రెడ్డి ల సమక్షంలో          టీఆర్ఎస్ పార్టీలో చేరారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ           కేవలం టీఆర్ఎస్ పార్టీలోనే ఎర్ర జొన్న రైతులకు ప్రాధాన్యం దక్కిందని,  మద్దతు దరకోసం నిరాహారదీక్ష కి దిగగానే 24 గంటలలోపే దేశంలో ఎక్కడ ఎవ్వరు ఇవ్వలేని మద్దతు ధర ప్రకటించిది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని ,    అన్నారు.              గతంలో ఎర్ర జొన్న బకాయిలు ఇప్పించిన జీవన్ రెడ్డి గారి నాయకత్వం లో పని చేయడనీకె ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి గారు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.నవీన్ రెడ్డి తో పాటు, వారి మిత్రులు….అజయ్ ,  కనకయ్య వార్డ్ మెంబెర్, యూత్ లీడర్స్ అంజి, అందపూర్ నవీన్, పవన్, హరి ప్రసాద్, వంశీ, శేఖర్, నరేష్, ప్రసన్న, ప్రతాప్, భరత్ మరియు వినయ్ మరియు ఇతర సభ్యులు జాయిన్ అయ్యారు.