టీఆర్ఎస్.. కాంగ్రెస్ హామీల మేళా!

హైదరాబాద్: వచ్చిన అధికారాన్ని పదిలం చేసుకోవాలనే తపన ఒకరిది.. ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలనే ఆకాంక్ష మరొకరిది. ఇటు టీఆర్ఎస్.. అటు కాంగ్రెస్ వాగ్దానాల వరద పారిస్తున్నాయి. పోటాపోటీగా హామీల మేళాకు తెర తీశాయి. ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉండగానే హామీల గాలంతో ఓటర్ల వేటకు రెడీ అవుతున్నారు. ఎన్నికల వేళ తీయాల్సిన అమ్ముల పొదిలోని అస్త్రాలను ముందే ప్రయోగిస్తున్నాయి. ఇప్పటి నుంచి నెలకొక కీలక హామీని ప్రకటించాలని పీసీసీ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఉచితంగా ఎరువులను ఇవ్వబోతున్నట్టు ఇటీవల టీఆర్ఎస్ ప్రకటించగానే కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇక ఆలస్యం తగదని భావించిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు తన మేనిఫెస్టోలోని ఒక్కొక్క పేజీని చదవడం మొదలు పెట్టాడు.