టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవబోతుంది

ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి
తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దేంకు కృషి
అపదర్మ మంత్రి ఈటల రాజేందర్‌
వరంగల్‌ అర్బన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ ఎన్నికలు కేవలం కెసిఆర్‌ అభివృదద్‌ఇ కార్యక్రమాలను చూసి ప్రజలు ఓటేశారని అన్నారు. తిరిగి టిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాబోతున్నదని అన్నారు. కమలాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. సోషల్‌ విూడియాలో చేసిన అసత్యప్రచారాలను, విష ప్రచారాలను, ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసినా, మాయమాటలు చెప్పినా వాటిని లెక్కచేయకుండా న్యాయం, ధర్మం వైపు నిలబడ్డారన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టి వాటిని అమలుచేసి ప్రజల మధ్య తిరిగామని, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వస్తున్నామని,
మరిన్ని పథకాలను ప్రజలకు అందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కుట్రలు, కుతంత్రాలు చేసినట్లే మహాకూటమి రూపంలో మరోసారి కుట్రలు, విష ప్ర యోగాలు చేసినా తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగురవేస్తున్న ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశంలో సింగిల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు పరిపాటి రవిందర్‌రెడ్డి, మాట్ల రమేష్‌, ఈటల భద్రయ్య, రాములు, అరవింద్‌, సమ్మిరెడ్డి,అశోక్‌, సతీష్‌, సంపత్‌, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.