టీవీ,ఫోన్లకు దూరంగా ఉండండి

అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు: వెంకయ్య
హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ఫోన్లు, టీవీలకు అంటుకుపోయే సంస్కృతికి దూరంగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. శారీరక శ్రమ మన జీవన శైలికి అత్యంత అవసరమని సూచించారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా కొంత కసరత్తు చేయాలన్నారు. అప్పుడే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌- కేర్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా శనివారం శంషాబాద్‌ పరిధి ముచ్చింతల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్సాహాన్నిస్తుందన్నారు. గ్రావిూణ ప్రాంతాలకూ వైద్య సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. పేదలకు వైద్యసేవలు అందుబాటులోకి రావాన్నారు.