టెన్త్‌ స్పాట్‌ కేంద్రం పరిశీలన

చిత్తూరు,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  పదో తరగతి మూల్యాంకనం కార్యక్రమంలో భాగంగా సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి చిత్తూరు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు దిద్దిన జవాబు పత్రాలను ఆమె పరిశీలించారు. మూల్యాంకనం పారదర్శకంగా చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ ప్రతాప్‌ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పాండురంగ స్వామి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.