టోల్‌ప్లాజాలోకి దూసుకెళ్లిన బీరు బాటిళ్ల‌ లారీ

జైపూర్‌ : రాజస్తాన్‌లో ఓ ట్రక్కు బోల్తా పడింది. విచిత్రంగా టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన తర్వాత, నెమ్మది చేసుకోవాల్సి ఆ వాహనం టోల్‌ప్లాజా సిబ్బంది మీదకు దూసుకెళ్లింది. ఏం జరుగుతుందో ఊహించని టోల్‌ప్లాజా సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

టోల్‌ప్లాజా వద్ద బోల్తా పడిన ఆ ట్రక్కు, బీరు బాటిళ్ల లోడుతో అటుగా వెళ్తోంది. ట్రక్కు బోల్తా పడటంతో, బీరు సీసాలన్నీ నేలపాలయ్యాయి. బీరంతా వరదలా పారింది. రాజస్తాన్‌లోని కిసాన్‌ఘడ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయింది.