ట్రావెల్స్‌ బస్సులో 100 కోట్లు

బెంగళూరు : కర్ణాటకలో భారీగా నగదు పట్టుబడింది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిక్కబళ్లాపూర్ జిల్లా తిప్పగానిపల్లి వద్ద బళ్లారి – అనంతపురం జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేశారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో రూ. 100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నగదు ఎక్కడికి తరలిస్తున్నారో కర్ణాటక పోలీసులు విచారిస్తున్నారు.