డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి: ఎమ్మెల్యే

జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల్లో కవిూషన్లు తీసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండని కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలే తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన డబ్బులు తిని తననే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ దొంగలే తనను
బఫూన్‌ను చేశారని కొప్పుల వాపోయారు.