డిస్టెన్స్ కోర్సులకు 31వరకు గడువు పొడిగింపు
హైదరాబాద్,మార్చి13(జనంసాక్షి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ నిర్వహిస్తున్న పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఒక సంవత్సర కాల వ్యవధితో నిర్వహించే ప్రోగ్రామ్స్లో బిజినెస్ మేనేజ్మెంట్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, సైబర్ లాస్, ఫొరెన్సిక్ సైన్స్, కెమికల్ అనాలసిస్, హ్యుమన్ రైట్స్, లైబ్రరీ ఆటోమేషన్ నెట్వర్కింగ్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఎనర్జీ మేనేజ్మెంట్ తదితర కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.