డి పి ఆర్ ఓ కు రాఖీ కట్టిన జడ్పీ చైర్మన్.

 

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు13(జనంసాక్షి):

రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాంకు నాగర్ కర్నూల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య రాఖీ కట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. రాఖీ పండుగ సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబందానికి ప్రతీక అని అన్నారు.జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని అన్నారు.