డీసీఎం, బైక్‌ ఢీ: ఇద్దరు మృతి

ఒకే జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు
మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌ రహదారిలో రోడ్డు ప్రమాదం సంభవించింది.  టిప్పర్‌ను ఓవర్‌ టేక్‌ చేస్తుండగా ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతిచెందాడు. టిప్పర్‌ను ఓవర్‌టేక్‌ చేస్తుండగా ఎదురుగా బస్సు రావడంతో టిప్పర్‌-బస్సు మధ్య చిక్కుకుని వాహనదారుడు మృతిచెందాడు. అదేవిధంగా నెల్లికుదురు మండలం బంజర స్టేజ్‌ వద్ద డీసీఎం వ్యాను బైక్‌ ను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.