డీసీఎం వ్యాన్‌లో మంటలు

దగ్ధమైన పేపర్‌ బండిల్స్‌

నల్గొండ, జులై 6 : జిల్లాలోని చివ్వెంల మండలం దురాస్‌పల్లి వద్ద పేపర్‌బండల్స్‌లో వెళ్తున్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వ్యాన్‌లో ఉన్న రూ.2 లక్షల విలువైన పేపర్‌బండిల్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. పేపర్‌బండిల్స్‌తో చిల్లకల్లూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా డీసీఎం వ్యాన్‌లో ఇంజిన్‌ వేడక్కడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ వ్యాన్‌ను రోడ్డుపక్కన నిలిపివేశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.