డ్రంకెన్‌ డ్రైవ్‌…వాహనాల సీజ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులపై హైదరాబాద్‌ కాచిగూడ ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝలిపించారు. కాచిగూడ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రకుమార్‌ ఆధ్వర్యంలో రామంతపూర్‌ పాలిటెక్నిక్‌, రాయల్‌ జ్యూస్‌ సెంటర్‌ సవిూపంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 28 మంది వాహనదారులపై కేసు నమోదు చేశారు. 18 టూ వీలర్స్‌, 4 కార్లు, 1 ఆటో, 5 లారీలను పట్టుకున్నారు. సీజ్‌ చేసిన వాహనాలను కోర్టుకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.