ఢిల్లీలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ

అంతిమయాత్ర రూట్లో మళ్లింపు

న్యూడిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): భారతరత్న అటల్‌ బిహారి వాజపేయి అంతిమయాత్ర నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం నుంచే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గ్‌, బహదూర్‌ షా జాఫర్‌ మార్గ్‌, ఢిల్లీ గేట్‌, నేతాజీ సుభాష్‌ మార్గ్‌ నుంచి రాష్టీయ్ర స్మృతి సమాధి వద్దకు వాజపేయి అంతిమయాత్ర చేరుకుంది. సరిగ్గా 1.55 నిముషౄలకు బిజెపి కార్యాలయం నుంచి పార్తివ దేహాన్ని తరలించారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించడానికి వీలుగా ట్రాఫిక్‌ క్లీయర్‌ చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో పలుమార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఐఎస్‌బీటీ కశ్మీర్‌ గేటు, లోయర్‌ రింగ్‌ రోడ్డు, శాంతి వనం, ఐపీఫ్లై ఓవర్‌ ప్రాంతాల్లో వాహనాలను అనుమతించ లేదు.