తండాల్లో పంచాయితీ దండోరా

తండాల్లో ఇక పంచాయితీ గంట మోగనుంది. కొత్తగా వందలాది తండాలు పంచాయితీలుగా ఏర్పడడంతో వాటిల్లో పంచాయితీ కల కానరానున్నది. తండాలను పంచాయతీలుగా మార్చిన సర్కారు, నూతన పంచాయతీలతో పల్లెలకు కొత్త రూపును తీసుకొస్తున్నది. ఈ నెల 31న సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తి కానుంది. ఇదే సందర్భంలో కొత్తగా ఏర్పడ్డ తండాల్లో పంచాయితీలుగా ఏర్పడ్డట్లుగా డప్పుడతో దరువు వేయనున్నారు. ఆగస్టు 2న గ్రామస్థుల భాగస్వామ్యంతో నూతన గ్రామపంచాయతీల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. కొత్త పంచాయతీలకు సైతం పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించి, పంచాయితీల్లో సరికొత్త పాలనకు తెరలేవబోతోంది. అయితే పంచాయితీలుగా మారిన తండాల్లో ప్రత్యేకాధికారుల పాలనతో తెరపైకి రానున్నాయి. సత్వరమే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో తండాల్లో స్వయం పాలనకు అవకాశం లేదు. తండాలన్నీ పంచాయితీలుగా మారినా సర్పంచ్‌లు మాత్రం రావడం లేదు. మారుమూల ప్రాంతాల్లో గ్రామపంచాయతీలకు సుదూరంగా ఉన్న చిన్నచిన్న గ్రామాలకు, తండాలకు మోక్షం లభించింది. ఏళ్లతరబడి ఎదురు చూస్తున్న నిరీక్షణలు ఫలిస్తున్నాయి. ప్రతి పనికోసం పక్క గ్రామానికి వెళ్లి గంటల తరబడి ఎదురు చూసే అవస్థలు తప్పనున్నాయి. ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాల్లో గ్రామపంచాయతీలను కొత్త ఏర్పాటు చేస్తున్నారు. దీంతో తండా ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆగస్టు 2 నుంచే కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామపంచాయతీల ఆవిర్భావ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించనున్నారు. చాటింపులు వేయించి గ్రామస్తులందరినీ భాగస్వామ్యం చేసేలా నూతన గ్రామపంచాయతీలను ప్రారంభించినున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ భవనాలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అదే రోజున గ్రామాలకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులుకూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే కొత్త పంచాయతీల అభివృద్ధి కోసం జిల్లాకు రూ.కోటి నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలు జరిగే దాకా కొత్త పంచాయతీల్లో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేందుకు ఈ నిధులను కేటాయించనున్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు కేటాయించినప్పటికీ అదనంగా కొత్త పంచాయతీలకు మరో రూ.కోటి నిధులను కేటాయించడంతో ఎన్నికల లోపు పంచాయతీల్లో అభివృద్ధి వేగవంతం కానుంది. దీంతో కొత్త పంచాయతీల్లో పరిపాలన ప్రజలకు చేరువకానుంది. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులతో పాలన సాగించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. నిన్న మొన్నటి వరకు సర్పంచ్‌లనే కొనసాగించాలన్న డిమాండ్‌ వచ్చింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఇక దానిని పక్కన పెట్టింది. చట్టపరంగా తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని కొత్త పంచాయతీల్లో పాత సర్పంచ్‌లను కొనసాగించే అవకాశాలను తోసిపుచ్చింది. దీనిపై సిఎం కెసిఆర్‌ స్పష్టమైన ఆదేవాలు ఇవ్వడంతో ఇక కార్యదర్శులు పంచాయితీలకు అధికారులు కాబోతున్నారు. ఇందులో భాగంగా తండాల్లో కూడా కార్యదర్వుల పాలనతో కొత్త పంచాయితీలు ఆవిర్భవించబోతున్నాయి. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని స్పెషల్‌ ఆఫీసర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. కొత్తపంచాయతీలకు కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలో కార్యదర్శుల నియామకం చేపట్టనున్నారు. ఇకపోతే కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా నూతన క్లస్టర్లు ఏర్పడనున్నాయి. దీంతో కొత్త గ్రామపంచాయతీల పరిధిలో మార్పులు రానున్నాయి. స్పెషల్‌ ఆఫీసర్లుగా ఎంపీడీఓలు, ఈఓలు, ఈఓపీఆర్డీలు, ఏఓ, తహసీల్‌దార్లను ప్రత్యేక

అధికారులుగా నియమించి పాలనను కొనసాగించనున్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రామపంచాయతీల్లోని కార్యాలయాలకు అవసరమైన సిబ్బందిని, భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. పాత పంచాయతీల్లో ఉన్న సిబ్బందిని కొత్త పంచాయతీలకు అనుగుణంగా విభజించనున్నారు. స్వీపర్లు, ఎలక్టీష్రియన్లు, వాచ్‌మెన్లు, బిల్‌ కలెక్టర్లు వంటి సిబ్బందిని అవసరానికి అనుగుణంగా ఆయా గ్రామాలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీల పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే వాటి పరిధి, జనాభాకు అనుగుణంగా ఆస్తుల పంపిణీ పూర్తి చేయనున్నారు. రెవెన్యూ రిజిస్టర్ల పంపిణీ అన్నిరకాల అధికార వ్యవహార పత్రాలను వేర్వేరు చేసి పంపిణీ చేయనున్నారు. గ్రామ పంచాయ తీలకు కేటాయించిన ప్రత్యేకాధికారులు నిర్ధేశించిన రోజున కచ్చితంగా బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామపంచాయతీ పేరున కొత్త బ్యాంక్‌ అకౌంట్‌ను గ్రామానికి కావాల్సిన తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాలు, సామాజిక పింఛన్ల పంపిణీ ఇతర ప్రభుత్వ అవసరాలను తీర్చేలా ప్రత్యేక అధికారులు పని చేయనున్నారు. ఇప్పటికే ఈ కార్యదర్శులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ పని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతీ పంచాయితీకి ఒక కార్యదర్శి ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇకపై ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి రాబోతున్నారు. నియామక పక్రియను సంబంధిత శాఖాధికారులు వేగవంతం చేస్తున్నారు. /ూర్యదర్శుల నియామక పక్రియ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. కొత్తగా నియమించే కార్యదర్శులకు మూడేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. ఆ తర్వాత కార్యదర్శుల పని తీరును బట్టి క్రమబద్ధీకరణ ఉంటుంది. సక్రమంగా పని చేయని కార్యదర్శులను క్రమబద్ధీకరించకుండా ఉండేలా నిబంధనలు రూపొందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నియామకాలు పూర్తి అయితే మరో రెండు నెలల్లో కొత్త కార్యదర్శులు విధుల్లో చేరవచ్చు.సర్పంచ్‌ల పదవీ కాలం ఆగస్టు 2తో ముగియనుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి పంచాయతీకి ప్రత్యేక పాలనాధికారులను నియమిస్తున్నారు.