తను ఎంపిగా ఉండగానే రైల్వే జోన్‌: హరిబాబు

విశాఖపట్నం,జూలై21(జ‌నం సాక్షి): తాను ఎంపిగా ఉండగానే ఎపికి రైల్వేజోన్‌ వస్తుందని బిజెపి ఎంపి హరిబాబు స్పష్టం చేశారు. శనివారం విూడియాతో మాట్లాడిన ఆయన..ఎపికి ఎంత న్యాయం చేయాలో అంతకంటే ఎక్కువ చేస్తామని మరోసారి చెప్పుకొచ్చారు. ఎపిని ఆదుకోవడానికి చట్టంలో లేనివి కూడా కేంద్రం చేసిందన్నారు. పెట్రోలియం వర్సిటీకి ఎపి ప్రభుత్వం ఇప్పటి వరకూ స్థలం కేటాయించలేదని హరిబాబు చెప్పారు. విదేశీ సంస్థల ద్వారా ఆర్థిక సాయం తీసుకుంటామని సిఎం చంద్రబాబు ఒప్పుకున్నారన్నారు. విభజన చట్టం ప్రకారం హావిూ ఇచ్చిన 11 సంస్థల్లో ఇప్పటికే 10 మంజూరు చేశామని హరిబాబు స్పష్టం చేశారు.