తలకు మించిన రుణ భారం తాళలేక ఓ రైతు ఆత్మహత్య

కొత్తకోట: తలకు మించిన రుణ భారం తాళలేక ఓ రైతు తనువు చాలించాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని ద్వారకానగర్ గ్రామానికి చెందిన గడ్డమీది బాలన్న(40) తనకున్న ఏడెకరాల్లో వరి, పత్తి, కంది సాగు చేశాడు. నీటి వసతి కోసం రెండేళ్లలో ఆరుబోర్లు వేయించగా రెండు మాత్రమే సక్సెస్ అయ్యాయి.

ఇందు కోసం మొత్తం రూ.8 లక్షల వరకు అప్పు అయింది. పంటలు సరిగా చేతికి రాకపోవటంతో బాలన్న తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలోనే గురువారం ట్రాక్ వద్దకు వెళ్లి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి బాలచంద్రమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.