తలసాని రాజీనామా చేయలేదు!

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
హైదరాబాద్‌: తెలంగాణ వాణిజ్యపన్నులశాఖ మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో శాసన సభాపక్షం సమావేశ అనంతరం మీడియాసమావేశంలో నాయినిని విలేకరులు ఉపఎన్నికలపై ఈ సమావేశంలో చర్చ వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రిసమాధానం ఇస్తూ ఆయన రాజీనామా చేశాడా? చేసినట్టు ఎక్కడా లేదే? అంటూ ప్రశ్నించారు. తలసాని కూడా తాను మంత్రి పదవి చేపట్టే ముందే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.