తాగిన మైకంలో కూతురిని హత్య చేసిన తండ్రి

మహబూబ్‌నగర్ : తాగిన మైకంలో ఓ తండ్రి కన్న కూతురినే హత్య చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నాగర్‌కర్నూలు మండలం భీమునిగూడలో ఈ దారుణం వెలుగుచూసింది. పీఎస్‌లో నిందితుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.